AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్క్స్లో పేలుడుపై విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ అధిపతి రవికృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించారు. వేట్లపాలెం పేలుడుకు కారణాలేంటి?.. బాధ్యులెవరు అనే అంశాలు తేల్చాలని తెలిపింది. నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.