AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ ముగిసింది. బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని కాకాణిని కోవూరు పోలీసులు విచారించారు. విచారణలో కేసుకు సంబంధంలేని ప్రశ్నలు అడిగారని, ఇబ్బంది పెట్టడానికే పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.