AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహారభద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పు అని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు.