TG: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. పూరిళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాళీ చేసేందుకు స్థానికులు గడువు కోరుతున్నారు. కాగా, భూదాన్ భూవివాదం కొన్నేళ్లుగా కోర్టులో నడుస్తోంది. 31 ఎకరాల్లో స్థానికులు పూరిళ్లు వేసుకున్నారు.