AP: నెల్లూరు GGH పిల్లల వార్డులో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆసుపత్రిలో రోగులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఆసుపత్రిలోని మెటర్నిటీ, పిల్లల వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. రోగులు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు చెప్పారు.