TG: కాంగ్రెస్, BRS పార్టీలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కవిత చేసే కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల పూర్తి మద్దతుతో బీజేపీ బలోపేతం అవుతోందని ధీమా వ్యక్తం చేశారు.