TG: భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించారు. అనంతోగు నుంచి పాల్వంచ అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. పులి సంచారంతో గుత్తికోయ గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.