దేశ వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు బీప్ శబ్దంతో కూడిన అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్లు వచ్చాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA), టెలికాం శాఖ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే సాంకేతికత పనితీరును తనిఖీ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది కేవలం పరీక్ష మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.