TG: మెదక్లోని రామచంద్రాపురం కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద నిర్మాణంలో ఉన్న సర్వీస్ రోడ్డును ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. త్వరలోనే ప్రజలకు దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యమే ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని పేర్కొన్నారు.