AP: పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని, అంబులెన్సులకూ దారి ఇవ్వట్లేదని CM చంద్రబాబు విమర్శించారు. తమ టైర్ల కింద మనుషుల్ని తొక్కించేసి.. ప్రభుత్వంపై నెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు తెలిసింది విధ్వంసమేనని దుయ్యబట్టారు. రప్పా రప్పా అంటూ కటౌట్లకు రక్తాభిషేకం చేయించడం ద్వారా హింసను ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.