BHPL: ప్రజలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ బౌతు శోభ రాజేష్ అన్నారు. శనివారం వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం సరిగ్గా అందుతుందా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలచే విద్యాభ్యాసం చేయించారు.