NLG: నకిరేకల్ మండలం నెల్లిబండలో శ్రీ లింగమంతుల స్వామి ఆలయాన్ని ఇవాళ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. త్వరలో జరగనున్న జాతరకు చేపట్టాల్సిన ఏర్పాట్లను గురించి అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.