AP: జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లస్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రూ.350గా ఉన్న రోజువారీ వేతనాన్ని రూ.550కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లస్కర్ల వినతి మేరకు వేతన పెంపు ప్రతిపాదనను ఆమోదించిన ప్రభుత్వం.. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.