గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీలో సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ‘ఎవడు'(2014) చిత్రం తర్వాత దాదాపు 12 ఏళ్లకు రామ్ చరణ్, సాయి కుమార్ మళ్లీ కలిసి నటిస్తున్నట్లు అవుతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.