నటి నివేదా పేతురాజ్ మూడేళ్ల విరామం తర్వాత టాలీవుడ్లోకి పునరాగమనం చేస్తోంది. ఇప్పటికే వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’లో నటిస్తున్న ఆమె, తాజాగా చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తుందట. కాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.