తమిళ స్టార్ హీరో సూర్య, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పూరి మార్క్ మేనరిజమ్స్తో సిద్ధం చేసిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫలితాల తర్వాత పూరి ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారట. విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమా ముగిశాక ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్.