ప్రముఖ గాయని K.S చిత్ర తన కుమార్తె నందన వర్ధంతి సందర్భంగా SMలో చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కలిచివేస్తోంది. 2011లో దుబాయ్లో జరిగిన ప్రమాదంలో తన ఏకైక బిడ్డను కోల్పోయిన చిత్ర.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. ‘బిడ్డ లేని లోటు ఎప్పటికీ తీరనిది, నీ జ్ఞాపకాలు నా గుండెల్లో నిరంతరం ఉంటాయి’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు.