TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ మాలధారణ భక్తులు కొండగట్టుకు భారీగా తరలొస్తున్నారు. ఇరుముడి ధరించి కాలినడకన భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.