MDK: వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ బస్టాప్ వద్ద ఇద్దరు చిన్నారులు ఒంటరిగా కనిపించారు. దీంతో గుర్తుతెలియని ఈ చిన్నారుల గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఇక్కడికి చేరుకున్నారనే అంశాలపై విచారణ చేపట్టారు.
MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన DCCB సర్వసభ్య సమావేశం జరిగింది. చిన్న రైతులు, వ్యాపారులకు సులభంగా రుణాలు అందించాలని ఆమె సూచించారు. మహిళా సంఘాలు, పాడి పరిశ్రమలకు రుణాలు విస్తరించాలని, పాత రుణాల వసూళ్లు మెరుగుపరచాలని ఆదేశించారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో RBI, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకత ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ASF: అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న DYFI జిల్లా అధ్యక్షుడు టికానంద్ను తిర్యాణి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఆయన మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం వెంటనే ప్రారంభించి, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 26వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాషా ఇటీవల గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇవాళ వారి స్వగృహానికి వెళ్లి పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, పాషా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
WNP: పాన్గల్ ఆగ్రో రైతు సేవ కేంద్రం వద్ద 300 బస్తాల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందని కార్యదర్శి భాస్కర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గురువారం ఉదయం 9:30 గంటల నుంచి బుకింగ్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. యాప్లో ముందస్తుగా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్రం వద్ద యూరియా అందజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
NLG: బొమ్మగాని ధర్మభిక్షం ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, కార్మిక నేత వర్ధంతి నేడు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన, విద్యార్థి దశ నుంచే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, తర్వాత 10, 11వ లోక్సభ సభ్యుడిగా, 3సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సేవ చేశారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు.
JGL: జిల్లాలో విద్యుత్ వినియోగదారుల కోసం చేపట్టిన విద్యుత్ ప్రజావాణిలో 1135 సమస్యలు పరిష్కరించినట్టు, SE బి.సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలనే సంకల్పంతో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్, డివిజన్, సెక్షన్ స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
VKB: పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పరశురాం రెడ్డి పంట పిచికారీ డ్రోన్ రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. బుధవారం ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన డ్రోన్ను పరిగి వ్యవసాయశాఖ అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. పంటలకు పురుగుమందులు పిచికారీ సులభంగా అతి తక్కువ సమయంలో చేసుకోవచ్చని చెప్పారు. రైతులు ఈ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
HYD: జర్నలిస్టుల పట్ల రాష్ట్రప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని నిన్న జర్నలిస్టులు ముట్టడించారు. ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
SRD: తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సమస్యలు, సిబ్బంది కొరతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినప్పటికీ, మౌలిక సదుపాయాలు, సంబంధిత బోధకులు లేక కుంటుపడిందన్నారు. హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్ పట్ల చర్యలు తీసుకోవాలన్నారు.
సిద్దిపేటలో ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వస్తున్నాయని 37వ వార్డు కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ‘బాలమేళా’లో విద్యార్థులకు స్టీల్ టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ స్టీల్ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని కోరారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని తున్కిఖల్సా విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతు పనుల కారణంగా, గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శాఖారం 11కేవీ ఫీడర్ పరిధిలోని డబుల్ బెడ్రూం ప్రాంతం, శాకారం గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ వాసుదేవరావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
PDPL: మంథని ప్రభుత్వ ఆస్పత్రి, మాతాశిశు కేంద్రంలో పనిచేస్తున్న పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటరీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని బుధవారం CITU ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగాది రోజున కార్మిక కుటుంబాలు ఉపవాసం ఉండాల్సి వచ్చిందన్నారు . ప్రభుత్వం విడుదల చేసిన వేతనాలను కాంట్రాక్టర్ వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ADB: రైతు భరోసా మొదటి విడత డబ్బులు విడుదల చేసిన నేపథ్యంలో బేల మండలంలోని సాంగిడి గ్రామంలో CM రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడం జరుగుతుందన్నారు. CM రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని పేర్కొన్నారు.
SRCL: తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామానికి చెందిన జానపద కళాకారిణి కోల స్నేహకు హైదరాబాద్ రవీంద్రభారతిలో పీపుల్స్ మీడియా పాయింట్ సంస్థ ‘శివంగి ఆత్మీయ పురస్కారం’ అందజేసింది. వందకుపైగా జానపద పాటలు రాసి పాడిన ఆమె, “అల్లిబిల్లి సోకులాడి సిట్టమ్మి” పాటతో మంచి గుర్తింపు పొందారు. భర్త వినయ్ కుమార్, తల్లిదండ్రులు విజయ-మల్లేశం తన విజయానికి సహకారమని తెలిపారు.