• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎర్రకుంటను మాయం చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 6లో 6.15 గుంటల భూమి ఎర్రగుంట ఉండేదని.. 2019లో కొందరు వెంచర్ యజమానులు రికార్డులను తారుమారు చేసి అనుమతులు పొందారని BC, SC, ST మండల జేఏసీ నాయకులు మధు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట భూమిని సర్వే చేసి అనుమతులు రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలన్నారు.

March 2, 2026 / 06:07 PM IST

ఖాజీపూర్ మల్లన్న కళ్యాణ మహోత్సవం

SDPT: భూంపల్లి-అక్బర్పేట్ మండలం ఖాజీపూర్‌లో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులను అభినందించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:04 PM IST

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత

SRCL: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గతంలో కరెంట్ షాక్‌‌కు గురై మృతి చెందిన అనుమల మహేందర్ కుటుంబానికి సెస్ వైస్ ఛైర్మన్ దేవరకొండ తిరుపతి రూ.5 లక్షల ఎక్స్రేషియా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఏఈ, గ్రామ సర్పంచ్ కమ్మరి స్వప్న నాగరాజు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:03 PM IST

బేటి బచావో బేటి పడావో పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

KNR: బేటీ బచావో.. బేటి పడావో పథకంలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, PCPNDT Act, చైల్డ్ హెల్ప్ లైన్ పోస్టర్లను ఆవిష్కరించారు.

March 2, 2026 / 06:01 PM IST

అంబం(వై)లో శవమై తేలిన అదృశ్యమైన వ్యక్తి

NZB: ఎడపల్లి మండలం అంబం(వై)కి చెందిన డప్పు మహేష్ (40) చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన మహేశ్ తిరిగి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. కాళ్లకు చేపల వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు గుర్తించారు.

March 2, 2026 / 06:00 PM IST

‘లైబ్రరీలో మౌలిక వసతులు కల్పించండి’

GDWL: పట్టణంలోని లైబ్రరీలో మౌలిక వసతులు కల్పించాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రధానంగా టాయిలెట్లు లేక మహిళా పాఠకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరారు.

March 2, 2026 / 06:00 PM IST

అంబట్పల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NGKL: లింగాల మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామం కాలనీలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులు సోమవారం ప్రారంభించారు. నిధులు కేటాయించినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అచ్యుత రెడ్డి, మాజీ సర్పంచ్ రవిశంకర్, నాయకులు జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:00 PM IST

LLB, పీజీ పరీక్షలు.. 107 మంది గైర్హాజరు

NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్ఎల్బీ 5వ, పీజీ మొదటి, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం 8 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,933 మంది విద్యార్థులకు 1,825 మంది హాజరు కాగా, 107 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

March 2, 2026 / 05:58 PM IST

‘రైతులు ఎరువులు కోసం ఆందోళన చెందవద్దు’

KMM: కూసుమంచి మండలంలోని పాలేరు శ్రీ వెంకటలక్ష్మి ఫర్టిలైజర్స్‌లో 555 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నట్లు ఏవో వాణి సోమవారం తెలిపారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు. మండలంలో సరిపడా నిల్వలు ఉన్నాయని అర్హులైన రైతులందరికీ ఎరువులు అందుతాయని ఆమె అన్నారు.

March 2, 2026 / 05:54 PM IST

‘రేణుక ఎల్లమ్మ తల్లి జాతరను జయప్రదం చేయండి’

BDK: చర్ల మండలం లక్ష్మి కాలనీ గ్రామపంచాయతీ పరిధిలోని జాంబవంతుని గుట్టలపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆలయ పూజారి మడకం దేవ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివాసి సాంప్రదాయ నృత్యాలతో రంగ రంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

March 2, 2026 / 05:53 PM IST

సీతానగరంలో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు

SRPT: మునగాల మండలం సీతానగరం గ్రామంలో పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా సోమవారం డ్రైనేజీ పూడికతీత పనులను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ వీరయ్య స్వయంగా పనులను పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం, సాధారణ రోజుల్లో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపించకుండా, దుర్వాసన రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

March 2, 2026 / 05:53 PM IST

ఉపాధ్యాయులైన విద్యార్థులు..!

NRPT: ధన్వాడ మండలంలోని కిస్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి స్వయం కృపరికాలన దినోత్సవం నిర్వహించుకున్నారు. పాఠశాల హెచ్ఎంగా సావిత్రి, డీఈవోగా శ్యామ్ రాజ్, ఎంఈవోగా శ్రీ చందన వ్యవహరించారు. ఉత్తమంగా విద్యా బోధన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్టు పాఠశాల హెచ్ఎం సరస్వతమ్మ తెలిపారు.

March 2, 2026 / 05:52 PM IST

‘భూదాన్ భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలి’

KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటరమణ ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల పేర్లు భూభారతి పోర్టల్‌ నుంచి మాయమై ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనిభూములపై పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.

March 2, 2026 / 05:46 PM IST

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో అడిషనల్ కలెక్టర్ నరసింగరావు, RDO శ్రీనివాసరావుతో కలిసి ప్రజలనుంచి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ నమోదు చేసి వారంలోగా పరిష్కరించాలన్నారు.

March 2, 2026 / 05:43 PM IST

నకిలీ వైద్యుడి డయాగ్నోస్టిక్స్ సెంటర్ సీజ్..!

SRPT: తప్పుడు అర్హత పత్రాలతో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్‌కు చెందిన యాపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ తేజస్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. వైద్యుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారి వేంకట రమణ తెలిపారు.

March 2, 2026 / 05:42 PM IST