KMR: గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ. 2 లక్షల వ్యయంతో మూడు పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలకు కనబడని చోట ఉంచడంతో వినియోగం లేకపోతోందని అంటున్నారు. ప్రజాధనం వృథా అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.
NLG: వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు సూర్యపెల్లి జ్యోతి శ్రీను నూతన ఇందిరమ్మ ఇళ్ళు ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్లు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
NZB: జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ హాల్లో సాగుతున్న కొత్త సర్పంచుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగియనుంది. జనవరి 19న ప్రారంభమైన ఈ శిబిరంలో పంచాయతీరాజ్ చట్టం, పాలనాపరమైన అంశాలపై అధికారులచే అవగాహన కల్పించారు. ఈరోజు కొనసాగిన శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు తమ విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని జిల్లా అధికారులు దిశానిర్దేశం చేశారు.
NZB: తాగుడుకు బానిసై మనస్తాపంతో ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన న్యాల్కల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికులు వెంటనే 108లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మురికి నీరు రోడ్డుపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 39వ వార్డులో మురికి కాలువలో నుంచి నీరు రోడ్డుపై ప్రవహించడంతో కాలనీ వాసులతోపాటు ద్విచక్ర వాహనదారులు, ప్రజలు నడిచేందుకు ఇబ్బందుల గురవుతున్నారు. సిబ్బంది వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ADB: జైనథ్ మండల విద్యాశాఖ అధికారి MEO శ్రీనివాస్ బెల్లూరి పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పర్యవేక్షించిన ఆయన, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, మౌలిక వసతులపై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.
HYD: మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం నేతృత్వంలో ప్రొ. కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి, త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వాటి అమలుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
SRPT: అనంతగిరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో ఇఫ్కో ఆర్థిక సహాయంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్సు షెల్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి అనంతగిరికి బస్సు సర్వీసులు ప్రారంభించి, ఈ షెల్టర్ను వినియోగంలోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
RR: రంజాన్ నమాజ్కు ముస్లిం సోదరులకు ఇబ్బందులు లేకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పహాడీషరీఫ్ దర్గా దగ్గర ఉన్న ఈద్గాను ఈరోజు పరిశీలించారు. వెంటనే శుభ్రం చేయాలని, నమాజ్కు వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
MBNR: నూతనంగా ఎన్నికైన మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుముల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి గురువారం జిల్లా ఎస్పీ జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో పరస్పర సహకారంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.
NRML: జిల్లాలో గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షకు 83 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6219 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6036 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వారు తెలిపారు.
ADB: జిల్లాలోని కోర్టుల్లో మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంక్, మోటార్ ప్రమాద క్లెయిమ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KMR: జిల్లా ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పటికీ కొందరి నిర్లక్ష్యంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్నూర్ మండలం అవల్ గావ్ గ్రామం నుంచి కొడిచిర గ్రామానికి వెళ్లే మార్గంలో తారు రోడ్డును గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్తో ధ్వంసం చేయడంతో రోడ్డు ధ్వంసం అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
KMR: తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ రాజా గౌడ్ అన్నారు. గురువారం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ సెలవులో ఉండటంతో, పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలగకుండా సర్పంచ్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. సిబ్బందితో కలిసి వీధుల్లోని చెత్తను తొలగింపజేశారు. పదవిలో ఉండి పని చేసిన సర్పంచ్ చొరవను గ్రామస్థులు కొనియాడారు.
NLG: యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.