NGKL: కేంద్ర ప్రాయోజిత ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 29న నిర్వహించే ‘ప్రీ-ఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ పరీక్షకు లబ్ధిదారులు విధిగా హాజరయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. వయోజనులకు చదువు నేర్పిన వారు తప్పనిసరిగా ఈ పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.