• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుంది’

PDPL: విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుందని రామగిరి మండలం చందనాపూర్ గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చందనాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్నవరం, రామప్ప విహార యాత్రకు బయలుదేరగా జెండా ఊపి సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ ప్రారంభించారు.

March 1, 2026 / 07:01 PM IST

‘అమరుల త్యాగాలు చిరస్మరణీయం’

NGKL: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ నాయకులు స్మరించుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

March 1, 2026 / 06:59 PM IST

ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన

SRD: విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని,ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఓ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అధ్యయన కేంద్రంలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

March 1, 2026 / 06:57 PM IST

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MHBD: గూడూరు మండలం రాములు తండాకు చెందిన భానోత్ నరసింహ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు.

March 1, 2026 / 06:57 PM IST

తూడుకుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 06:49 PM IST

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: నల్లబెల్లి(M)కేంద్రంలోని ముచ్చింపుల గ్రామంలో ఆదివారం రూ.10 లక్షల వ్యయంతో CC రోడ్ల నిర్మాణానికి MLA దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంచి రహదారులు ఉంటే గ్రామ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 06:48 PM IST

హసకొత్తూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్‌కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.

March 1, 2026 / 06:41 PM IST

‘మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రభుత్వం’

MNCL: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో ఆదివారం మహిళల సమస్యలు పరిష్కారాలు అంశంపై సదస్సు నిర్వహించారు. AIDWA రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశలత పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలు పోరాటంలోకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాన్నారు.

March 1, 2026 / 06:40 PM IST

‘క్రీడాకారులను తీర్చిదిద్దడంలో పీఈటీల పాత్ర కీలకం’

ADB: విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో పీఈటీ పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ పీడీ, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యాయామ విద్య బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు.

March 1, 2026 / 06:39 PM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్

MDK: కౌడిపల్లి మండలం బుజరాంగ్‌పల్లిలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి, 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.28,296 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

March 1, 2026 / 06:36 PM IST

కరాటే పోటీల్లో కనిమెట్ట విద్యార్థుల ప్రతిభ

WNP: జడ్చర్లలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్‌లో కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన విద్యార్థులు పతకాలతో మెరిశారు. అండర్-11 విభాగంలో వంశీ బంగారు, అండర్-12లో భార్గవి చంద్రకళ వెండి పతకం సాధించారు. మన్యంకొండకు చెందిన మహేష్ కూడా ప్రతిభ కనబరిచారు. విజేతలను క్రీడాభిమానులు అభినందించారు.

March 1, 2026 / 06:33 PM IST

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందజేత

MNCL: బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ముష్కే వెంకట్ కుటుంబానికి ఆయన మిత్రులు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 2000 బ్యాచ్‌కు చెందిన వెంకట్ సహ ఉద్యోగులు సేకరించి, రూ.2 లక్షల చెక్‌ను వారి కుటుంబానికి అందించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన పోలీసులు స్నేహ ధర్మం చాటుకున్నారు.

March 1, 2026 / 06:32 PM IST

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నాగర్‌కర్నూల్ మండల పరిధిని తూడుకుర్తి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తూడుకుర్తికి చెందిన బోనగళ్ల నాగ మశన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గురించి హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 06:31 PM IST

కన్నేపల్లిలో ‘నా ఊరు – నా బాధ్యత’ కార్యక్రమం

ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆలోచన మేరకు ఆదివారం “నా ఊరు – నా బాధ్యత” సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువత స్వచ్ఛందంగా పాల్గొని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో శ్రమదానం చేశారు. గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న యువత తెలిపారు.

March 1, 2026 / 06:31 PM IST

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: రాకేష్ రెడ్డి

HNK: పట్టణ కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇవాళ ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రణతి పాలిక్లినిక్ సహకారంతో వైద్య నిర్వహించారు. కాలనీలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా BRS రాష్ట్ర నాయకుడు, ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేష్ రెడ్డి హాజరై, మాట్లాడారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 1, 2026 / 06:30 PM IST