కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏవోగా రాజగోపాల్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన ఆయనకు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణతో పాటు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.