SDPT: ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మైనార్టీల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తినందుకు సిద్దిపేట బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఆయనను సన్మానించారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయడం లేదని, రేవంత్ రెడ్డి సర్కార్ మైనార్టీలను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.
SS: ధర్మవరంలోని 5వ వార్డు శారదా నగర్, అలాగే 30, 31వ వార్డుల దుర్గానగర్ ప్రాంతాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పింఛన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ పింఛన్లు భరోసాను ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి 31న పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రెంటచింతలలో 39 డిగ్రీల గరిష్ఠ, 23 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, నరసరావుపేటలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. తెనాలిలో గరిష్ఠం 37, కనిష్ఠం 23 డిగ్రీలుగా నమోదైంది. బాపట్లలో 34, 24గా నమోదైంది.
NTR: కంచికచర్ల పట్టణంలోని అరుంధతి కాలనీలో ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ పండుగలా సాగుతోంది. టీడీపీ సీనియర్ నాయకులు శేషం కనకరత్నం సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెన్షన్ దారులు సకాలంలో తమ లబ్ధిని పొందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం గడ్డి కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
MNCL: పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని నెన్నెల సర్పంచ్ ఇబ్రహీం అన్నారు. బుధవారం నెన్నెల మండల కేంద్రంలోని పలు వార్డ్ లలో ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన పారిశుధ్య పనులను పంచాయతీ సెక్రెటరీ సురేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని కాలనీవాసులకు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
AKP: రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకొని గత నెల 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఈనెల రెండవ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రేపటితో పదో తరగతి పరీక్షలు పూర్తవుతున్నట్లు పేర్కొన్నారు.
KMR: మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రతపై కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, యువతకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయని, బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
BHNG: బీబీనగర్ ఎయిమ్స్ వద్ద 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 98.26 కోట్ల రూపాయలతో 690మీటర్లు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆసుపత్రికి వచ్చే వారికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.
VZM: కొత్తవలస బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఓరుగంటి మురళీకృష్ణ ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మురళీకృష్ణ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణకు అభినందనలు తెలిపారు.
AP: దేశంలోనే పెద్దమొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం AP అని మంత్రి DBV స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చిర్రికూరపాడులో పింఛన్ల పంపిణీ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నామని.. పింఛన్ల పెంపుపై మాటతప్పి దివ్యాంగులు, వృద్ధులనూ మోసగించిన ఘనత జగన్దేనని విమర్శించారు
ELR: పెదవేగిలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతన బీటీ రోడ్డును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం రాత్రి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే చొరవతో దీనిని నిర్మించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీస్ విభాగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.
BHPL: SFI రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులకు భూపాలపల్లి జిల్లాకు చెందిన నేతలు హాజరయ్యారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలు, తదితర అంశాలను రాష్ట్ర నేతలకు జిల్లా నేతలు వివరించారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరన్, జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.
MLG: జిల్లాకు చెందిన BJP సీనియర్ నాయకుడు అజ్మీర ప్రహ్లాద్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, విస్తరణకు తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా కృతజ్ఞతలు తెలిపారు.
TG: ట్యాంక్బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున CM రేవంత్ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా శివ కుమారుడు వేణుమాధవ్కు హోంగార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు. శివ దీన పరిస్థితి ఇటీవల సీఎం దృష్టికి చేరింది. ఈ క్రమంలోనే శివ కుటుంబానికి 3 పడకల ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.