వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి మొబైల్ మెసేజింగ్ యాప్లను తప్పనిసరిగా సిమ్తో అనుసంధానం చేసేందుకు విధించిన గడువును కేంద్రం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిమ్ బైండింగ్ నిబంధన ప్రకారం మొబైల్లో సిమ్ యాక్టివ్గా ఉంటేనే మెసేజింగ్ ప్లాట్ఫామ్లు సర్వీసులు అందిస్తాయి.