సత్యసాయి: మడకశిరలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని శనివారం డిప్యూటీ డీఈవో జాన్ రెడ్డెప్ప తనిఖీ చేశారు. పరీక్షలో కాపీయింగ్కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారిని డిబార్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్ష కేంద్రం అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.