SDPT: సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. గురువారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు ప్రభుత్వంలో ఉంటే ఏనాడు మత్స్యకారుల కోసం ఆలోచించలేదన్నారు.