AP: తిరుపతిలోని చంద్రగిరి బైపాస్రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆటోను స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.