PLD: గురజాల నూతన డీఎస్పీగా మల్ల మహేశ్వరరావు విధుల్లో చేరారు. బదిలీలో భాగంగా విజయనగరం నుంచి గురజాలకు వచ్చారు. ఆదివారం గురజాల డీఎస్పీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖలో తన అనుభవంతో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.