పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజలకు దోమతెరలను అందజేశారు. మలేరియా, డెంగ్యూ నివారణలో దోమతెరల వినియోగం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలు, వితంతువులు, అణగారిన వర్గాల్లో హరించబడిన మానవ హక్కులు కొరకు పూలే పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BPT: చీరాల రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు రెడ్ క్రాస్ ఛైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. శనివారం స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు అనంతరం కొంతకాలం సేవా కార్యక్రమాలలో జాప్యం ఏర్పడినప్పటికీ, నూతన కార్యవర్గం ఏర్పాటుతో తిరిగి సేవలను యథావిధిగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
TPT: పెళ్లకూరు వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ డౌన్ కావడంతో DCM రోడ్డు పక్కన ఆగింది. ఈ క్రమంలో నాయుడుపేట వైపు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. వెంటనే కారు వెనుక వస్తున్న మరో వాహానం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ASR: అరకువేలిలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ డా. దొన్నుదొర ఘనంగా నిర్వహించారు. పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం బీసీలకు భారీ బడ్జెట్, 34% రిజర్వేషన్లు, ఆదరణ 3.0 అమలు చేస్తున్నదన్నారు. గత వైసీపీ పాలనలో బీసీలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
VSP: ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని శనివారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం నూతన వస్త్రాలు, బంగారు పూత ఆభరణాలను సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ.. 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించి భార్య సావిత్రీబాయి పూలేను విద్యావంతురాలిని చేసి ఆమె ద్వారా ఇతర మహిళలకు విద్యను అందించారన్నారు.
KRNL: కపటి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చే వారు కూడా ఎవరు లేరా అని పిల్లలు ప్రశ్నించారు. అదనపు తరగతి గదులుతో పాటు బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
W.G: వేండ్ర గ్రామంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తనయుడు కనుమూరి భరత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలకోడేరు మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం చలివేంద్ర కేంద్రం ప్రారంభించారు. పేదలకు వస్త్ర దానం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
NLR: ఉదయగిరిలో ఈనెల 16న నియోజకవర్గ క్రైస్తవుల ఐక్య మహాసభ జరుగుతుందని నియోజకవర్గ క్రైస్తవుల ఐక్య వేదిక శనివారం తెలిపింది. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలను చర్చించే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ వేదిక మత స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన హామీలను రక్షించాలని యావత్ క్రైస్తవ సమాజం కోరుకుంటుందని వివరించింది.
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మాసాపేట బ్రిడ్జి వద్ద ఉన్న పూలే విగ్రహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పూలే కులవివక్ష వ్యతిరేక ఉద్యమకారుడని, మహిళా విద్యా ప్రోత్సాహకుడన్నారు. అణగారిన వర్గాల సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు.
ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. శనివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అరికెపూడి గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
VZM: సమానత్వం విద్య సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేముడుబాబు అన్నారు. పూలే జయంతి పురస్కరించుకుని జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో, కలెక్టరేట్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, దేవర కిరణ్ పాల్గొన్నారు.
GNTR: గుంటూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
CTR: బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూలే సేవలు, ముఖ్యంగా విద్యా రంగంలో చేసిన కృషి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.