BPT: చీరాల రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు రెడ్ క్రాస్ ఛైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. శనివారం స్థానిక రెడ్ క్రాస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు అనంతరం కొంతకాలం సేవా కార్యక్రమాలలో జాప్యం ఏర్పడినప్పటికీ, నూతన కార్యవర్గం ఏర్పాటుతో తిరిగి సేవలను యథావిధిగా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.