• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్

PLD: అమరావతి మద్దూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రోడ్డులో సీఎం హెలిప్యాడ్ కోసం పరిసరాలను శుభ్రం చేసి, రహదారులను సిద్ధం చేశారు. కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి, భద్రత, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

April 14, 2026 / 08:40 AM IST

రాయదుర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.30 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 32వ వార్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో రూ.30.65 లక్షలతో సీసీ రోడ్డు పనులను మొదలుపెట్టామన్నారు.

April 14, 2026 / 08:39 AM IST

మహిళా కార్యకర్తకు అండగా ఎమ్మెల్యే

E.G: అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చౌట జయలక్ష్మికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి ఆర్థిక సాయం అందించారు. ఆమె మోకాళ్ల సర్జరీ కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రి అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సోమవారం సూచించారు. తక్షణ ఖర్చుల కోసం రూ.10,000 అందజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.

April 14, 2026 / 08:38 AM IST

‘దండోరా ద్వారా గ్రామసభల తేదీలు తెలియజేస్తాం’

VZM: గంట్యాడ మండల పరిధిలో ఈ నెల 16 నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు స్దానిక MPDO రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామసభలు జరుగుతాయన్నారు. ఏ గ్రామంలో ఏ తేదీన గ్రామసభ జరుగుతుందన్న విషయమై ముందుగా గ్రామాల్లో దండోరా ద్వారా ప్రజలకు తెలియజేస్తారన్నారు.

April 14, 2026 / 08:33 AM IST

గ్రామాల్లో భద్రతపై పోలీసుల అవగాహన సదస్సులు

సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ అధికారులు సభలు ఏర్పాటు చేసి మహిళా భద్రత, మాదక ద్రవ్యాల అనర్థాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై వివరిస్తూ కొత్త వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

April 14, 2026 / 08:31 AM IST

దివ్యాంగ సంఘాలు ఆలయ ఛైర్మన్‌కు వినపతి పత్రం అందజేత

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఛైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్లకు దివ్యాంగ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. ఆలయంలో వివిధ విభాగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేయాలని, దివ్యాంగ భక్తులకు బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్లు, అవరోధ రహిత దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

April 14, 2026 / 08:30 AM IST

శ్రీకాకుళంలో గ్యాస్ కొరత.. రోడ్డున పడ్డ హోటల్ కార్మికులు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 400 హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు దాబాలు కొనసాగుతున్నాయి. వాటి ద్వారా సుమారు 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వాణిజ్య సిలెండర్ల కొరత కారణంగా ఇప్పటికే దాదాపు సగం హోటల్లు మూత పడ్డాయి. పూర్తిగా మూతపడితే ఆయా కుటుంబాలన్నీ రోడ్డున పడాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

April 14, 2026 / 08:26 AM IST

డీజేలు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ

కోనసీమ: అంబేడ్కర్ జయంతి సందర్భంగా SP రాహుల్ మీనా ఆదేశాలతో ఆలమూరు పరిధిలోని నర్సిపూడిలో సోమవారం రాత్రి గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని CI విద్యాసాగర్ సూచించారు. ఫ్లెక్సీలు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 14, 2026 / 08:18 AM IST

‘రిస్క్ మ్యాపింగ్ చేసి, నివేదిక అందించాలి’

ASR: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పిల్లలు చనిపోవడాలు నివారించేందుకు కలెక్టర్ నిశాంతి సోమవారం కఠిన ఆదేశాలు జారీచేశారు. ప్రమాదకర కాలువలు, చెరువులు, జలపాతాలను గుర్తించి, రిస్క్ మ్యాపింగ్ చేసి శుక్రవారంలోగా ఐటీడీఏకు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. లోతైన ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, వెదురు కంచెలు, తాళ్లతో బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.

April 14, 2026 / 08:06 AM IST

సమస్యల పరిష్కారంలో జాప్యం వహించ రాదు

SKLM: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించ రాదని అన్నారు.

April 14, 2026 / 08:05 AM IST

ఆటో డ్రైవర్‌ను అభినందించిన సీఐ

CTR: ఆటోలో మర్చిపోయిన సెల్ ఫోన్ తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ చంద్రశేఖర్‌ను సీఐ సోమశేఖర్ రెడ్డి అభినందించారు. పట్రపల్లెకు చెందిన యాస్మి వీకోట మార్కెట్ యార్డ్ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు గోవింద్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ ఆటోలో ప్రయాణం చేసింది. ఆటో దిగే సమయంలో అందులో సెల్ ఫోన్ మర్చిపోయింది. దానిని గుర్తించిన అతడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు.

April 14, 2026 / 08:03 AM IST

నేడు సంతమాగులూరుకు మంత్రి గొట్టిపాటి రాక

BPT: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ ఇవాళ సంతమాగులూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సంతమాగులూరులో నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయనకు నివాళులర్పిస్తారు. అనంతరం నెహ్రూనగర్‌లో నూతన బీటీ రోడ్డును, అలాగే ‘పి.ఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (ఉచిత సోలార్ విద్యుత్) పథకాన్ని ప్రారంభించనున్నారు.

April 14, 2026 / 08:00 AM IST

వ్యక్తిని ఢీకొన్న లారీ.. రెండు కాళ్లు నుజ్జు నుజ్జు

PLD: క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన తోకల లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి . గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఫంక్షన్‌కి వెళ్లి వస్తూ సత్తెనపల్లి మండలం నందిగం సమీపంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.

April 14, 2026 / 08:00 AM IST

‘శ్రీరాముడు విగ్రహం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా బాధకారం’

VZM: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలోని రామతీర్థం కోదండ రాముడి ఆలయంలో శ్రీరాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన యావత్ దేశవ్యాప్తంగా కలిచి వేసిందని రాష్ట్ర ఎం.ఎస్.ఎం. ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముడు విగ్రహంతో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలను కోటిపల్లి గోదావరి తీరంలో నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.

April 14, 2026 / 08:00 AM IST

‘డ్రగ్స్ వాడకం జాతీయ భద్రతకు ముప్పు’

GNTR: వడ్లమూడి వర్సిటీలో డ్రగ్స్‌పై అవగాహనకు ‘దండి మార్చ్ 2.0’ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఏపీ ఈగల్ ఐజీపీ రవికృష్ణ సోమవారం పాల్గొన్నారు. డ్రగ్స్ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పని ఆయన హెచ్చరించారు. వీటికి పెట్టే ఖర్చు ఉగ్రవాదులకు చేరుతోందన్నారు. నార్కో టెర్రరిజంపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 14, 2026 / 08:00 AM IST