VZM: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలోని రామతీర్థం కోదండ రాముడి ఆలయంలో శ్రీరాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన యావత్ దేశవ్యాప్తంగా కలిచి వేసిందని రాష్ట్ర ఎం.ఎస్.ఎం. ఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రామతీర్థంలో ధ్వంసమైన శ్రీరాముడు విగ్రహంతో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలను కోటిపల్లి గోదావరి తీరంలో నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.