• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం: మంత్రి

NDL: ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే పురపాలక పాఠశాలను ఆయన శనివారం పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. TDP హయాంలో పాఠశాలలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

February 28, 2026 / 08:27 PM IST

నన్నయ వర్సిటీలో నేషనల్ సైన్స్ డే

E.G: నన్నయ యూనివర్సిటీలో శనివారం నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ప్రిన్సిపల్ డా. పి.విజయనిర్మల, తదితరులు వేడుకలు ప్రారంభించారు. వికసిత భారత నిర్మాణంలో మహిళల పాత్రపై జరిగిన వర్క్‌షాప్‌లో వారు ప్రసంగించారు. సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 08:23 PM IST

సాధికారత ఉపాధి కల్పన పథకాల అమలుపై సమీక్ష

ఏలూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి శనివారం ఉంగుటూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి మహిళ సాధికారత ఉపాధి కల్పన పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.

February 28, 2026 / 08:22 PM IST

షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పెమ్మసాని

GNTR: పెదకాకాని మండలం నంబూరులో శనివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ వలివేటి మురళీకృష్ణ, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:21 PM IST

‘రేపు కూడా పన్నుల చెల్లింపునకు ఛాన్స్’

E.G: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో శనివారం కమిషనర్ రాహుల్ మీనా కీలక ప్రకటన చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు, నీటి ఛార్జీల చెల్లింపునకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నగరపాలక సంస్థ ట్రెజరీలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు కట్టే వెసులుబాటు కల్పించారు.

February 28, 2026 / 08:19 PM IST

యువ చైతన్య వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి

కృష్ణా: ఉంగుటూరు(M) ఆత్కూరులో నైపుణ్యాభివృద్ధి కోర్సులో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన యువ చైతన్య వేదిక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. యువత తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని కష్టపడి పని చేసి స్వయం ఆధారంగా నిలబడాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఇందులో విశ్రాంత IAS అధికారి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.

February 28, 2026 / 08:16 PM IST

ఏకీకృత కుటుంబ సర్వే పై ఆరా తీసిన ZP CEO

NLR: బుచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి సందర్శించారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఏకీకృత కుటుంబ సర్వే కు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటి పన్నులు త్వరగా చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.

February 28, 2026 / 08:13 PM IST

అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానమే మూలం

VZM: అభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానమే మూలం అని జనవిజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడు డా. ఎంవిఆర్ కృష్ణాజీ అన్నారు. చీపురుపల్లి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక సైన్స్ దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఆవిష్కరణలు, శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, శివాజీ పాల్గొన్నారు.

February 28, 2026 / 08:12 PM IST

బోధనా పరికరాలపై టీచ్ టూల్ శిక్షణకు శ్రీకారం

అన్నమయ్య: రాయచోటిలోని డైయెట్‌లో బోధనా పరికరాల ఆధారిత తరగతి గది పరిశీలన అంశంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ టీచ్ టూల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ ప్రతినిధులు పండవుల సాయిరామ్, నాగేంద్ర, కోర్స్ కోఆర్డినేటర్ మదితాటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:07 PM IST

కందుకూరులో మంచినీటి పథకం కోసం రూ.19 కోట్లు: MLA

NLR: కందుకూరు మున్సిపాలిటీ శివారు ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసిందని MLA నాగేశ్వరరావు అన్నారు. శనివారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. త్వరలో శివారు ప్రాంత వాసుల మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

February 28, 2026 / 08:05 PM IST

ప్రసన్న కాకాణిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే

NLR: వైసీపీ నాయకుల దగ్గర డబ్బులు లేక అడుక్కుని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విమర్శించారు. కొడవలూరులో ఆమె మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజవర్గంలో అడుగుపెట్టని కాకాణి తాము డబ్బులు ఉన్న వాళ్ళమ్మని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కుటుంబం నుంచి కూడా రాజకీయాల్లోకి మహిళా వస్తుందని గుర్తుపెట్టుకుని మాట్లాడాలన్నారు.

February 28, 2026 / 08:03 PM IST

క్షత్రగాత్రులను పరామర్శించిన ఎంపీ

KKD: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరామర్శించారు. ప్రతి బాధితుడి పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ వైద్యులను స్పష్టంగా ఆదేశించారు.

February 28, 2026 / 08:02 PM IST

‘ప్రజలు సంతృప్తి చెందే దిశగా వైద్య సేవలందించాలి’

PPM: ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని, తిరిగి వారు సంతృప్తి వ్యక్తం చేసే దిశగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. జగన్నాధపురం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. తొలుత హెచ్.పి.వి వ్యాక్సిన్ లాంచింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి వీక్షించారు.

February 28, 2026 / 08:00 PM IST

క్రియాశీల సభ్యత్వంపై జనసేన సమావేశం

VSP: జనసేన పార్టీ నగర కార్యాలయంలో క్రియాశీల (ఉద్యమి) సభ్యత్వ నమోదుపై శనివారం ముఖ్య సమావేశం జరిగింది. నగర (పార్లమెంట్) అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నాయకులతో చర్చించారు. సభ్యత్వంపై కార్యకర్తల సందేహాలు తెలుసుకుని నివృత్తి చేశారు. ప్రతి కార్యకర్త ఉద్యమి సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు.

February 28, 2026 / 08:00 PM IST

కిడ్నీ బాధితులకు అండగా ఎమ్మెల్యే శిరీషాదేవి

ASR: ఉర్లకులపాడులో కిడ్నీ బాధితులను ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. ఇక్కడ ఆరుగురు మరణించినా, నీటి నమూనాలు సురక్షితమేనని, అపోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 08:00 PM IST