• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తారకరత్న బెంగళూరుకు తరలింపు

నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...

January 28, 2023 / 10:20 AM IST

పోస్టాఫీసులో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...

January 28, 2023 / 10:19 AM IST

సైకో జగన్ పోవాలి… సైకిల్ రావాలి… అచ్చన్న

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ తొలి అడుగు వేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. అధికారం కోసమైతే లోకేష్ 400రోజులు 4వేల ...

January 28, 2023 / 09:10 AM IST

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీ...

January 28, 2023 / 09:02 AM IST

వివేకా హత్య కేసులో.. నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైఎస్సార్‌ సీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు జారీచేసింది. దర్యాప్తునకు హాజరుకావాలంటూ సూచించింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు...

January 28, 2023 / 08:38 AM IST

దేశం కోసమే బిఅర్ఎస్: కెసిఆర్, పార్టీలో చేరిన మాజీ సీఎం

దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్...

January 28, 2023 / 07:55 AM IST

నేడు రథసప్తమి.. భక్తులతో కిక్కిరిసిన అరసవల్లి

నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని చూసేందుకు అరసవల్లికి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. సూర్యభగవానుడి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం క్యూలలో భక్తులు గంటల సేప...

January 28, 2023 / 08:03 AM IST

మంత్రి అంబటిని చెప్పుతో కొడతా: వైసీపీ ఎంపీటీసీ విజయలక్ష్మి

సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లే...

January 27, 2023 / 09:49 PM IST

పాదయాత్ర ముగియగానే నేరుగా తారకరత్న దగ్గరికి వెళ్లిన నారా లోకేశ్

యువగళం పేరుతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు నుంచి ఏపీలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇవాళ ప్రారంభమైన పాదయాత్రలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత లోకేశ్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ...

January 27, 2023 / 08:16 PM IST

సీఎం జగన్ వస్తున్నాడు.. పెళ్లి వేరే చోట చేస్కోండి

నెలన్నర ముందు వివాహ మండపం బుక్ చేసుకుంటే తీరా పెళ్లి సమయం వచ్చేసరికి మండపం నిర్వాహకులు షాకిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో తాము మండపం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో హడావుడిగా వెంటనే వేరే మండపం కోసం కాబోయే దంపతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం జగన్ పర్యటన తమ చావుకొచ్చిందని ఆ కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో జరిగింది. దీనికి సంబంధించిన ...

January 27, 2023 / 05:48 PM IST

నీలి రంగులోకి తారకరత్న..బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

‘యువగళం’ పేరిట కుప్పం నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనాల తాకిడికి నటుడు నందమూరి తారకరత్న సొమ్మసిల్లిపడిపోయాడు. అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి అతడి శరీరం నీలిరంగులోకి మారిందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను తెలుగుదేశం పార్టీ నాయకులు బెంగళూరుకు తరలిస్తున్నట్లు సమాచారం. ల...

January 27, 2023 / 04:12 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు

మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఈనెల 29, 30 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంపై తేమ అధికంగా ఉండటం వల్లనే అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురవనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్ర...

January 27, 2023 / 03:59 PM IST

400 రోజులు ఉతికినా ఎలుక తోలు రంగు మారదు..అంబటి

పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లక్ష్యంగా మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఇద్దరు నేతలు పాదయాత్రతో జనంలోకి వెళుతుండగా.. వారిని టార్గెట్ చేశారు. దీపంతో సిగరెట్ వెలిగించేవాడని తండ్రి గురించి పవన్ కల్యాణ్ ఓ సందర్భవంలో పేర్కొన్నారు. స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానించిన పుత్రుడు ఈ సమాజానికి అవసరమా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 400 రోజులు...

January 27, 2023 / 02:34 PM IST

యువగళం లో అపశృతి.. నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత

నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి వాహనం పైనుంచి పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర మొదలయింది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో లోకేశ్‌ పక్కనే తారకరత్న ఉన్నారు . మసీదు...

January 27, 2023 / 01:12 PM IST

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి యాప్ సేవలు

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ అందుబాటులోకి టీటీడీ యాప్ అందులోకి తెచ్చింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన మొబైల్ యాప్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. టీటీడీ సేవలు, మొత్తం సమాచారం అంతా ఒక చోట ఉండే విధంగా జియో సహకారంతో ఈ కొత్త యాప్ ను రుపొంచినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా వర్చువల్ సేవలను భక...

January 27, 2023 / 12:51 PM IST