• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా మొదలైన ఇంటర్ పరీక్షలు..!

CTR: కుప్పంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష కేంద్రాలకు 9 గంటల లోపే విద్యార్థులు చేరుకోగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1st లాంగ్వేజ్ సెట్ వన్ ప్రశ్నాపత్రం చాలా సులభంగా రావడంతో విద్యార్థులు ఖుషి అయ్యారు.

February 25, 2026 / 10:03 AM IST

మారెమ్మ తల్లి జాతర మహోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కోనసీమ: గ్రామ దేవతల ఆరాధన మన ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాడపాలెం శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 25, 2026 / 10:02 AM IST

విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన..!

చిత్తూరు జిల్లాలో కాంట్రాక్ట్ టీచర్ వెంకటేశ్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించగా తిరుపతిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 10:02 AM IST

నిధుల మంజూరుకు ఎమ్మెల్యే సింధూర వినతి

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం CM చంద్రబాబు నాయుడును కోరారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని, హంద్రీనీవా కృష్ణా జలాలతో చెరువులు నింపాలని విన్నవించారు. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.

February 25, 2026 / 10:00 AM IST

ఈ నెల 27న జిల్లా నేతలతో సీఎం కీలక భేటీ

ATP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27న అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో అమరావతిలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. శాంతిభద్రతల అంశంపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

February 25, 2026 / 10:00 AM IST

‘హెచ్చరిక.. దళారులను నమ్మి మోసపోవద్దు’

ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

February 25, 2026 / 10:00 AM IST

మార్చి 1న జలుమూరు మండల సర్వసభ్య సమావేశం

SKLM: మార్చి ఒకటి ఆదివారం ఉదయం 10:30 కు మండల అధ్యక్షులు వాన గోపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో చిన్న మూడు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని అన్నారు. జడ్పిటిసి మెండ విజయశాంతి రాంబాబు అధికారులు సభ్యులు పాల్గొవాలని ఆమె సూచించారు.

February 25, 2026 / 10:00 AM IST

నంద్యాలలో పోలీసుల విస్తృత తనిఖీలు

నంద్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశాలతో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆశ్రఫ్ బాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. నిషేధిత వస్తువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామని తెలిపారు.

February 25, 2026 / 10:00 AM IST

అంగన్‌వాడీ స్థలంపై అక్రమ నిర్మాణం వివాదం

KDP: గోపవరంలో సంఘ సముద్రం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంపై అక్రమ నిర్మాణం వివాదం రేగింది. సర్వే నెంబర్ 1122-2Aలో అధికారులు ఏర్పాటు చేసిన చూచిక బోర్డును తొలగించి ఓ వ్యక్తి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 25, 2026 / 10:00 AM IST

మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: కోసిగి మోడల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంగ్లిష్ మీడియం 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు సుందర్ తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 30 వరకు ఆన్‌‌లై‌న్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. OC, BC విద్యార్థులు రూ.200, SC, ST విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు.

February 25, 2026 / 10:00 AM IST

తెలుగు యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

VSP: విశాఖకు చెందిన తెలుగు యూట్యూబర్ కోమలి (21) హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఆత్మహత్యకు పాల్పడింది. చదువుతో పాటు హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందిన ఆమె, సొంతూరికి చెందిన యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ప్రేమ విఫలమవడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నట్లు సమాచారం.

February 25, 2026 / 09:45 AM IST

‘27న సత్యం, న్యాయాన్ని సమాధి చేస్తున్నారు’

GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేయడంపై ఆమె తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 27న ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు పోరాటం చేసినా తమ కుమార్తెకు న్యాయం జరగలేదని, అదే రోజు సత్యం–న్యాయం–ధర్మాన్ని సమాధి చేస్తున్నట్టేనని వారు వేదనతో చెప్పారు.

February 25, 2026 / 09:45 AM IST

శ్రీకాళహస్తి గుడి ఈవో బదిలీ.. కారణం ఇదేనా?

TPT: శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి బదిలీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఈవోని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా ఏర్పడిన ఆలయ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయి, ఈవోకి మధ్య విభేదాలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఛైర్మన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్లారు.

February 25, 2026 / 09:44 AM IST

రాజధాని పనుల అప్పగింతపై భిన్నాభిప్రాయాలు

GNTR: రాజధాని గ్రామాల్లో రూ. 1,000 కోట్లతో చేపట్టే మౌలిక వసతుల పనులను, ప్రస్తుతం ప్లాట్లు అభివృద్ధి చేస్తున్న పాత సంస్థలకే అప్పగిస్తున్నట్లు మంత్రి నారాయణ గ్రామ సభల్లో ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఉన్న పనుల గడువు పూర్తి చేయడానికి ఆ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని, ఈ అదనపు పనులు కూడా వారికే ఇవ్వడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

February 25, 2026 / 09:40 AM IST

DY.CM పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే

NLR: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. వెంకటగిరి అభివృద్ధికి సహకరించాలని వినతపత్రం అందించారు. వెంకటగిరికి ఎంతో చరిత్ర ఉందని.. ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నవించారు.

February 25, 2026 / 09:40 AM IST