అన్నమయ్య: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలకు పరిష్కారం లభించింది. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో 33 వెబ్ ల్యాండ్ 1B పత్రాలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కోర్ట్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 9 మంది రైతులకు కలెక్టర్ స్వయంగా 1B పత్రాలు అందజేశారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.