SKLM: రణస్థలం మండలం జీరుపాలెం సముద్ర తీరంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మెరైన్ ఫిష్ సీడ్ లాంచింగ్ కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సముద్రపు చేప పిల్లలను విడుదల చేశారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించి వలసలు నివారిస్తామన్నారు.