KKD: పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈనెల 13న నిధులు జమ కానున్నాయని జగ్గంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు గరిమెళ్ల శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చే రూ. 6,000ల్లో ఆఖరి విడత రూ. 2,000లను మార్చి 13న ప్రధాన మంత్రి విడుదల చేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ సొమ్మును వ్యవసాయ పనుల కోసం వినియోగించుకోవాలని ఆయన కోరారు.