E.G: నన్నయ యూనివర్సిటీలో శనివారం నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ప్రిన్సిపల్ డా. పి.విజయనిర్మల, తదితరులు వేడుకలు ప్రారంభించారు. వికసిత భారత నిర్మాణంలో మహిళల పాత్రపై జరిగిన వర్క్షాప్లో వారు ప్రసంగించారు. సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు.