కృష్ణా: ఉంగుటూరు(M) ఆత్కూరులో నైపుణ్యాభివృద్ధి కోర్సులో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన యువ చైతన్య వేదిక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. యువత తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని కష్టపడి పని చేసి స్వయం ఆధారంగా నిలబడాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ఇందులో విశ్రాంత IAS అధికారి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.