KRNL: ఆదోనిలో ఆదివారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పర్యటించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.