అన్నమయ్య: రాయచోటిలోని డైయెట్లో బోధనా పరికరాల ఆధారిత తరగతి గది పరిశీలన అంశంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ టీచ్ టూల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లీడర్షిప్ ఫర్ ఈక్విటీ ప్రతినిధులు పండవుల సాయిరామ్, నాగేంద్ర, కోర్స్ కోఆర్డినేటర్ మదితాటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.