NLR: బుచ్చి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి సందర్శించారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఏకీకృత కుటుంబ సర్వే కు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇంటి పన్నులు త్వరగా చెల్లించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.