NDL: గుంటూరులో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ CRIF-సేతు బంధన్ పథకం కింద రూ.98 కోట్లతో నిర్మిస్తున్న 4 లేన్ల ROBను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక నేతలు కోరిన అండర్పాస్ ప్రతిపాదనపై అంచనాలు సిద్ధం చేస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.