ATP: మంత్రి నిమ్మల రామానాయుడును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలిశారు. కళ్యాణదుర్గం ప్రాంత జీవనాడి అయిన బీటీపీ కాలువ పనులను మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు. కాలువ కోసం భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందేలా చూడాలని, ఇందుకోసం సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రికి విన్నవించారు.