IPLలో ఓ అద్భుత రికార్డ్ గుజరాత్ టైటాన్స్ సొంతం. 2025లో ఆ టీమ్ తరఫున సాయి సుదర్శన్ 759, శుభ్మన్ గిల్ 650, జోస్ బట్లర్ 538 రన్స్ చేశారు. IPL చరిత్రలో ఒకే సీజన్లో ఓ జట్టు నుంచి ముగ్గురు ప్లేయర్లు 500+ స్కోర్స్ చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు సీజన్లలో ఇలా RCB, CSK, MI, SRH, DC, LSG తరఫున ఇద్దరేసి ప్లేయర్లే 500+ స్కోర్స్ చేయగలిగారు.