AP: అనంతపురం జిల్లాలో బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి(M) కోనఉప్పలపాడులో 5 ఏళ్ల బావమరిది వేంచంద్రను అతని బావ సర్వేశ్ నిన్న హత్య చేశాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి నిందితుడిని తీసుకెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు సీఐ, కానిస్టేబుల్ గాయపడ్డారు.