ATP: పామిడిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం అద్భుతం జరిగింది. స్వామివారి పాదాలను సూర్య కిరణాలు తాకాయి. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత కూడా ఈ సూర్య కిరణాలు తాకుతాయని అర్చకుడు పురుషోత్తం తెలిపారు. ఈ అద్భుతాన్ని తిలికించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అధిక రద్దీ నెలకొంది.